
మధ్యతరగతి.. అధోగతి
మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారింది. ఆర్థిక అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరకపోవడంతో అప్పులబాట పడుతున్నారు. ఇదే అదనుగా పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ వ్యాపారం కోరలు చాచింది. రూ.5 నుంచి రూ.10 వరకు వడ్డీ వ్యాపారం ఇష్టారాజ్యంగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాది గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకపోగా.. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుండటంతో మధ్యతరగతి వర్గాలు సతమతమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా సంక్షేమ పథకాల రూపంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమకాగా.. ప్రజలు అప్పుల వైపు వెళ్లని పరిస్థితి.
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత సామాన్యుడి కష్టాల తారాస్థాయికి చేరాయి. ఒకవైపు మండుతున్న నిత్యావసరాల ధరలు, మరోవైపు ప్రభుత్వ చేయూత లేకపోవడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్సిక్స్ అంటూ హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకులు చేతులెత్తేశారు. తల్లికి వందనం అందించకుండా ఒక విద్యా సంవత్సరం, అన్నదాత సుఖీభవ సాయం ఇవ్వకుండా ఖరీఫ్, రబీ సీజన్లు గడిపేశారు.
తగ్గిన కొనుగోలు శక్తి
మార్కెట్లో నగదు లావాదేవీలతో పాటు ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో వ్యాపారాలు మందగించాయి. గత ప్రభుత్వ హయాంలో సంక్రాంతికి అ మ్మఒడి పథకం కింద ఏలూరు జిల్లాలో 1,78,214 మంది తల్లుల ఖాతాల్లో రూ.267.32 కోట్లు నగదు జమైతే కేవలం పండుగ రోజుల్లోనే జిల్లాలోనే రూ.150 కోట్ల నుంచి రూ.170 కోట్ల టర్నోవర్ జరిగినట్టు అంచనా. అయితే ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో 50 శాతం కూడా కొనుగోళ్లు లేవని వ్యాపార వర్గాలు అంటున్నాయి. గతంలో డీబీటీ పథకాలు కావడంతో మార్కెట్లో నగదు రోటేషన్లో ఉండటం, ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండటంతో విక్రయాలు బాగా జరిగి వ్యాపారాలు కళకళలాడటంతో జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికీ ఆదాయం సమకూరేది. ఈ ఏడాది మాత్రం జీఎస్టీ మొదలు అన్ని లావాదేవీలు తగ్గిపోయాయి. కొన్ని రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా ఇప్పటికీ తల్లికి వందనంపై కూటమి ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
గత ప్రభుత్వంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ.1,850 కోట్లకు పైగా నగదు జిల్లాలో లక్షలాది మంది బ్యాంకు ఖాతాల్లో జమకాగా.. నేడు ఒక్క రూపాయి కూడా జమ కాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలకు పేర్లు, లబ్ధి నగదు మొత్తాన్ని మార్చి ప్రకటించినా అమలు చేయకపోవడం గమనార్హం. ఈ లెక్కన ఏలూరు జిల్లాలో రూ.2 వేల కోట్లకు పైగా సంక్షేమ పథకాల నగదు ప్రజల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.
న్యూస్రీల్
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పథకాల అమలు
వైఎస్సార్ రైతు భరోసా
2019–20లో 2,31,061 మంది రైతులకు రూ.311.93 కోట్లు, 2020–21లో రూ.297.73 కోట్లు, 2021–22లో రూ.265.67 కోట్లు, 2022–23లో రూ.262.11 కోట్లు మొత్తంగా రూ.1,137.34 కోట్లు అందజేత
జగనన్న విద్యాదీవెన
2019–20లో 36,527 మంది విద్యార్థులకు రూ.95.78 కోట్లు, 2020–21లో రూ.77.97 కోట్లు, 2021–22లో రూ.105.67 కోట్లు, 2022–23లో 56.16 మొత్తంగా రూ.335.58 కోట్ల లబ్ధి చేకూర్చారు.
జగనన్న అమ్మఒడి
2019–20లో 1,80,327 మంది మహిళల ఖాతాల్లో రూ. 270.49 కోట్లు, 2020–21లో 266.16 కోట్లు, 2021–22లో 276.36 కోట్లు మొత్తంగా రూ.813.01 కోట్లు అందించారు.
వైఎస్సార్ ఆసరా
ఏలూరు జిల్లాలో మూడు విడతల్లో రూ.985.82 కోట్లు జమ చేశారు. 3,55,315 మంది మహిళల ఖాతాల్లో 2020–21లో రూ.327.56 కోట్లు, 2021–22లో రూ.329.92 కోట్లు, 2022–23లో రూ.328.34 కోట్లు అందజేశారు.
వైఎస్సార్ చేయూత
2020–21లో 94,670 మంది మహిళలకు రూ.177.51 కోట్లు, 2021–22లో రూ.165.60 కోట్లు, 2022–23లో రూ.218.42 కోట్లు మొత్తంగా రూ.561.53 కోట్లు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
అప్పులతో సతమతం
ఏడాదిగా నిలిచిన సంక్షేమ పథకాలు
పల్లెల్లో కోరలు చాచిన మైక్రో ఫైనాన్స్ వ్యాపారం
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఆర్థిక భరోసా
జిల్లాలో ఏటా సగటున రూ.1,850 కోట్లు అందజేత
నాడు కళకళలాడిన వ్యాపారాలు
నేడు కూటమి పాలనలో వెలవెల

మధ్యతరగతి.. అధోగతి