ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం

Jun 7 2025 1:16 AM | Updated on Jun 7 2025 1:16 AM

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం

ప్రశాంతంగా డీఎస్సీ పరీక్షలు ప్రారంభం

భీమవరం: జిల్లాలో మెగా డీఎస్సీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 30 వరకు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనుండగా.. తొలిరోజు భీమవరం డీఎన్నార్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మాత్రమే పరీక్షలు జరిగాయి. ఉదయం 110 మంది అభ్యర్థులకు 100 మంది, మధ్యాహ్నం 110 మందికి 97 మంది హాజరయ్యారు. కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలోని ఐదు కేంద్రాల్లో సుమారు 16,600 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. 23 రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. డీఈఓ ఈ.నారాయణ, చీఫ్‌ సూపరింటెండెంట్‌ తంగిరాల హరిఆనంద్‌ప్రసాద్‌, కాలేజీ ప్రిన్సిపాల్‌ ఎం.అంజన్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement