9న కొల్లేరుపై కీలక సమావేశం | - | Sakshi
Sakshi News home page

9న కొల్లేరుపై కీలక సమావేశం

Jun 7 2025 1:16 AM | Updated on Jun 7 2025 1:16 AM

9న కొల్లేరుపై కీలక సమావేశం

9న కొల్లేరుపై కీలక సమావేశం

కై కలూరు: సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు పరిశీలనకు త్వరలో రానున్న సెంట్రల్‌ ఎంపవర్ట్‌ కమిటీ (సీఈసీ)కి నివేదించే అంశాలపై ఈనెల 9న ఉదయం 9 గంటలకు కై కలూరు సీతారామ ఫంక్షన్‌ హాలులో నిర్వహించనున్న సమావేశానికి కొల్లేరు పెద్దలు తరలిరావాలని రాష్ట్ర చేపల రైతుల సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు శుక్రవారం కోరారు. కొల్లేరు ప్రజల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందన్నారు. కమిటీ దృష్టికి కొల్లేరు గ్రామాలకు సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలను రాతపూర్వకంగా గ్రామాల ప్రజలు తీసుకురావాలని చెప్పారు. గ్రామాల జనాభా, విస్తీర్ణం, కొల్లేరుకు సంబంధించిన అంశాలు అందులో ఉండాలన్నారు. సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ హాజరవుతారన్నారు.

9న ఆయిల్‌పామ్‌ రైతుల ధర్నా

పెదవేగి: కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై 10 శాతం దిగుమతి సుంకం తగ్గించడాన్ని నిరసిస్తూ ఈనెల 9న ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్‌ వద్ద ఆయిల్‌పామ్‌ రైతుల ధర్నా, రైతుల సామూహిక రాయబార కార్యక్రమం చేపట్టినట్టు ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం విజయరాయిలో ఆయిల్‌పామ్‌ రైతుల సమావేశాన్ని మున్నంగి సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ దిగుమతి సుంకం తగ్గడంతో ఆయిల్‌పామ్‌ గెలల ధరలు తగ్గి రైతులు నష్టపోతున్నారన్నారు. ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. పెదవేగిలో ఆయిల్‌ఫెడ్‌ కర్మాగారం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకోవాలన్నారు. రైతులు పూసం రామరెడ్డి, రాపర్ల తేజ కృష్ణ, నీలం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement