విశ్రాంత డీఈవోపై దాడి కేసులో నిందితుడు అరెస్టు | - | Sakshi
Sakshi News home page

విశ్రాంత డీఈవోపై దాడి కేసులో నిందితుడు అరెస్టు

Jun 29 2025 2:23 AM | Updated on Jun 29 2025 2:23 AM

విశ్రాంత డీఈవోపై దాడి కేసులో నిందితుడు అరెస్టు

విశ్రాంత డీఈవోపై దాడి కేసులో నిందితుడు అరెస్టు

విజయనగరం క్రైమ్‌ : విజయనగరం టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉంటున్న విశ్రాంత డీఈవో అప్పలనాయుడుపై దాడి చేసిన నిందితుడ్ని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించి సీఐ శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు... నగరంలోని పూల్‌బాగ్‌లో నివాసం ఉంటున్న అప్పలనాయుడు ఇంటికి ఈ నెల 26న సోలార్‌ ప్యానెల్‌ పని నిమిత్తం వంకర కృష్ణ వచ్చాడు. అంతకు ముందు ఈ నెల 24న కృష్ణ విశ్రాంత డీఈవో ఇంటికి వచ్చినపుడు ఇంట్లో మహిళల ఒంటిపై బంగారు ఆభరణాలు ఉండడం చూసి పక్కా పథకం రచించాడు. ఈ క్రమంలో 26న ఇంటికి వేట కొడవలిని సంచిలో పెట్టుకుని కృష్ణ వచ్చాడు. ఆ సమయంలో అప్పలనాయుడు ఫోన్‌ చూస్తుండగా ఒక్కసారిగా వెంట తెచ్చిన వేట కొడవలితో ఆయనపై దాడి చేశాడు. ఈ మేరకు అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి భోగాపురానికి చెందిన కృష్ణను శనివారం అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement