ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి

Jun 25 2025 1:13 AM | Updated on Jun 25 2025 1:13 AM

ఆపదలో

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి

ఐసీడీఎస్‌ పీడీ విమలారాణి

విజయనగరం ఫోర్ట్‌: ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలవాలని విజయనగరం వన్‌స్టాప్‌ సెంటర్‌ సిబ్బందికి ఐసీడీఎస్‌ పీడీ టి.విమలారాణి సూచించారు. వన్‌స్టాప్‌ సెంటర్‌ను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీచేశారు. రికార్డులను పరిశీలించారు. ఇంతవరకు ఎంతమందికి సంరక్షణ కల్పించారన్న అంశంపై ఆరా తీశారు. మహిళల సంరక్షణ కోసం ట్రోల్‌ ప్రీ నంబర్‌ 181ను సంప్రదించాలనే విష యాన్ని మహిళలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సెంటర్‌ ఆడ్మినిస్ట్రేటర్‌ పి.సాయివిజయలక్ష్మి, కౌన్సిలర్‌ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.

పక్కి గ్రామానికి

గజరాజుల గుంపు

బొబ్బిలి రూరల్‌: మండలంలోని పలు గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న తొమ్మిది ఏనుగుల గుంపు మంగళవారం పక్కి గ్రామ పరిసరాల్లోకి చేరుకుంది. సీతానగరం మండలం నుంచి ముత్తాయివలస, కమ్మవలస, శివడవలస మీదుగా పక్కి గ్రామ పరిసరాల్లోని అరటితోటల్లో తిష్టవే శాయి. స్థానిక ప్రజలను అటవీ సిబ్బంది అప్రమత్తం చేశారు.

అభినందనలు

విజయనగరం ఫోర్ట్‌: డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా నియమితులైన డాక్టర్‌ ఎం.జయచంద్రనాయుడుకు రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని సూపరింటెండెంట్‌ చాంబర్‌లో మంగళవారం ఆయనను సత్కరించి శుభకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంబంగి అప్పలనాయుడు, డిప్యూటీ సూపరింటెండెంట్‌ శివశ్రీధర్‌, ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ జయధీర్‌, వైద్యులు లోక్‌నాథ్‌, అప్పలనాయుడు, వెంకటనాయుడు, మణికుమార్‌, వంశీకృష్ణ పాల్గొన్నారు.

యువతకు సదావకాశం

పార్వతీపురం టౌన్‌: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాలూరు శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో ఈ నెల 28న ఉదయం 9 గంటలకు జాబ్‌మేళా జరగనుందని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్‌, ఐటీఐ, ఏదైనా డీగ్రీ చదువుకొని 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీ యువకులు జాబ్‌మేళాకు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన యువకులు httpr://naipunyam.ap.gov.in వెబ్‌సైట్‌ లో పేరు నమోదు చేసుకొని, రిఫరెన్స్‌నంబర్‌తో పాటు బయోడేటా, ఆధార్‌ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు ఒరిజినల్‌, జెరాక్స్‌, ఒక పాస్‌ఫొటోతో జాబ్‌మేళాకు హాజరు కావాలని కోరారు. 12 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై అర్హత కలిగిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌: 94947 77553, 73825 59022 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఆపదలో ఉన్నవారికి        అండగా నిలవాలి 1
1/2

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి

ఆపదలో ఉన్నవారికి        అండగా నిలవాలి 2
2/2

ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement