నగరమంతా తీరంలోనే.! | - | Sakshi
Sakshi News home page

నగరమంతా తీరంలోనే.!

Jun 2 2025 1:31 AM | Updated on Jun 2 2025 1:31 AM

నగరమంతా తీరంలోనే.!

నగరమంతా తీరంలోనే.!

ఏయూక్యాంపస్‌: సాగరతీరం ఆదివారం జనసంద్రంగా మారింది. ఎటు చూసినా కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి సంతోషంగా గడుపుతున్న దృశ్యాలు కనిపించాయి. నగరం మొత్తం తీరంలోనే ఉందా అనే భావన కలిగింది. చిన్న పిల్లలతో కలిసి నగరవాసులు పెద్ద సంఖ్యలో ఆర్‌.కె.బీచ్‌ నుంచి వీఎంఆర్డీఏ పార్కు వరకు ఉన్న పర్యాటక ప్రాంతాలకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతాలన్నీ సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. బీచ్‌కి భారీగా వ్యక్తిగత వాహనాల్లో రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. బీచ్‌రోడ్డుతో పాటు సిరిపురం కూడలి, చినవాల్తేరు వంటి ప్రాంతాల్లో వాహనాలు బారులుతీరాయి. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement