
సర్వ దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్లో 11 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధ రాత్రి వరకు 74,510 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 28,050 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో భక్తులు హుండీలో రూ.3.98 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 15 గంటలు సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.