
పోలీస్ అవుట్ పోస్ట్కు కూటమి బ్యానర్లు
రేణిగుంట: రేణిగుంట మండలంలో తిరుపతి, చైన్నె, నెల్లూరు రహదారులు కలిసే ప్రధాన కూడలిలో ట్రాఫిక్ నియంత్రణ, నిత్య పర్యవేక్షణకు పోలీస్ అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ అవుట్ పోస్ట్ మూడు వైపులా అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు బ్యానర్లు కట్టేశారు. దీంతో అవుట్ పోస్ట్ నిరుపయోగంగా మారింది. నిత్యం అనేక మంది ప్రముఖులు విమానాశ్రయం నుంచి ఇదే మార్గాన తిరుమలకి వెళ్లి వస్తుంటారు. అలాంటి ముఖ్యమైన మార్గంలో అవుట్ పోస్ట్ను నిరుపయోగంగా ఉంచడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పోలీస్ అవుట్ పోస్ట్కు కూటమి బ్యానర్లు