బాబయ్యస్వామి మొదటి గంధం వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. పీఠాధిపతి సజ్జద్బాబా ఆధ్వర్యంలో ఆయన స్వగృహం నుంచి భక్తిశ్రద్ధలతో ఆయన కుటుంబ సభ్యులు, భక్తులు దర్గా వద్దకు చేర్చారు. అనంతరం స్వామి సమాధి వద్ద ప్రార్థనలు చేసి గంధాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా పక్కీర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తాదులతో దర్గా ప్రాంతం కిటకిటలాడింది. అంతకు ముందు ప్రభుత్వం తరఫున కలెక్టర్ శ్యాంప్రసాద్, మంత్రి సవిత బాబయ్యస్వామికి చాదర్ను సమర్పించారు.
– పెనుకొండ:
భక్తిశ్రద్ధలతో గంధం వేడుక


