పేదల కడుపు కొట్టేందుకు ‘కూటమి’ యత్నం | - | Sakshi
Sakshi News home page

పేదల కడుపు కొట్టేందుకు ‘కూటమి’ యత్నం

Jun 11 2025 11:45 AM | Updated on Jun 11 2025 11:45 AM

పేదల కడుపు కొట్టేందుకు ‘కూటమి’ యత్నం

పేదల కడుపు కొట్టేందుకు ‘కూటమి’ యత్నం

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): గత ప్రభుత్వంపై ఉన్న కోపంతో కూటమి సర్కారు పేదల కడుపు కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని పలువురు నాయకులు అన్నా రు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని డా.జెట్టిశేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పేదల ఆహార భద్రతపై నగదు బదిలీ ప్రభావం అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వెంకమరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ ఇంటింటికీ వచ్చి వాహనాల ద్వారా రేషన్‌ ఇస్తున్న విధానాన్ని తొలగించి ప్రజలు షాపుల వద్దకు వెళ్లి తెచ్చుకునేలా చేశారని మండిపడ్డారు. సబ్సిడీపై నేడు నాలు గు రకాల వస్తువులు మాత్రమే ఇస్తున్నారని, కేరళ రాష్ట్రంలో మాదిరిగా 16 రకాల వస్తువులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రేషన్‌ బియ్యాన్ని అధికార పార్టీ నా యకులు, పెత్తందారులు పాలిష్‌ చేసి బయట రాష్ట్రాలకు అఽధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించా రు. సమావేశంలో నేతలు పుల్లయ్య, వెంగయ్య, దుగ్గిరాల అన్నపూర్ణమ్మ, తిరుపాలు, శ్రీరాములు, రమణ య్య, చండ్ర రాజగోపాల్‌, రమణ, రఘురామయ్య, రాధయ్య, షాన్‌వాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement