
స్వగ్రామానికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కలిగిరి: మండలంలోని బిమ్మరాజుచెరువు – నాగిరెడ్డిపాళెం మధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలంపాడు గ్రామానికి చెందిన దామంచర్ల హజరత్తయ్య (50) మృతిచెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పోలంపాడు గ్రామానికి చెందిన హజరత్తయ్య ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, కుమార్తె ఉన్నారు. అత్తగారి ఊరైన వింజమూరు మండలం రావిపాడుకు ఆదివారం వెళ్లాడు. తిరిగి రాత్రి భార్య అరుణతో మోటార్బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఆగి ఉన్న బైక్ను ప్రమాదవశాత్తు ఢీకొనగా భార్యాభర్తలు రోడ్డుపై పడిపోయారు. హజరత్తయ్య తీవ్రంగా, అరుణ స్వల్పంగా గాయపడ్డారు. వారిని కలిగిరిలోని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషయంగా ఉండటంతో హజరత్తయ్యను నెల్లూరుకు తరలించారు. ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కలిగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.