నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు

Mar 29 2023 4:02 AM | Updated on Mar 29 2023 4:02 AM

మాట్లాడుతున్న ఏడీఏ బాబు నాయక్‌ - Sakshi

మాట్లాడుతున్న ఏడీఏ బాబు నాయక్‌

దుబ్బాక: నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని గజ్వేల్‌ ఏడీఏ బాబు నాయక్‌ హెచ్చరించారు. మంగళవారం రాయపోల్‌ మండల రైతు వేదికలో ఫర్టిలైజర్‌ డీలర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. అధికారులు ధృవీకరించిన విత్తనాలు, ఎరువులను మాత్రమే రైతులకు విక్రయించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మాలని సూచించారు. నిబంధనలు పాటించనివారిపై కేసులు నమోదు చేసి, దుకాణాలు సీజ్‌ చేస్తామని అన్నారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువుల బిల్లులపై సంతకాలు చేయాలని, షాప్‌లో నిల్వ సమాచారాన్ని స్టాక్‌ బోర్డులో ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఏఓ నాగరాజు, ఏఈఓ ప్రశాంత్‌, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement