ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి

- - Sakshi

రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెల్లాపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ చిట్టి, నైబర్‌హుడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఈశ్వరగారి రమణ, నాయకులు ఉమేష్‌లు పాల్గొన్నారు.

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top