స్కూల్‌ పిల్లలకు తప్పిన ముప్పు | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ పిల్లలకు తప్పిన ముప్పు

Jul 3 2025 7:41 AM | Updated on Jul 3 2025 7:41 AM

స్కూల్‌ పిల్లలకు తప్పిన ముప్పు

స్కూల్‌ పిల్లలకు తప్పిన ముప్పు

మొయినాబాద్‌: డ్రైవర్‌ నిర్లక్ష్యంతో స్కూల్‌ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన నాగిరెడ్డిగూడలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌ బస్సు బాకారం నుంచి పిల్లలను ఎక్కించుకుని నాగిరెడ్డిగూడ వెళ్తుండగా గ్రామ సమీపంలో రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఒకవైపు చక్రాలు పంటపొలంలోకి దూసుకెళ్లడంతో బస్సు ఆగిపోయింది. ఈ సమయంలో బస్సులో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతోనే రోడ్డు కిందికి దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు మండిపడ్డారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. స్కూల్‌ బస్సులు వరుస ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో వీటి ఫిట్‌నెస్‌పై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement