
భారతి సిమెంట్కు తిరుగు లేదు
అనంతగిరి: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా ఎదుగుతున్న భారతి సిమెంట్ అల్ట్రాఫాస్ట్ పేరుతో ఫాస్ట్ సెట్టింగ్ సిమెంట్ 5స్టార్ గ్రేడ్ను తెలంగాణలో ప్రవేశపెట్టిందని, సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్ తెలిపారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్లోని ఓంసాయి ట్రేడర్స్ డీలర్ షాప్లో తాపీ మేసీ్త్రల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్కెట్లో లభించే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ వేగంగా పూర్తవుతుందన్నారు. స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణానికి ఈ సిమెంట్ సరైన ఎంపిక అని తెలిపారు. అల్ట్రాఫాస్ట్ వినియోగదారులకు ఉచిత సాంకేతిక సాయం అందజేస్తామని, స్లాబ్, కాంక్రీట్ వేసే సమయంలో నిపుణులైన భారతి సిమెంట్ ఇంజనీర్లు సైట్ వద్దకు వచ్చి సహాయపడుతారని స్పష్టంచేశారు. మార్కెట్లో దొరికే ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ ధర బ్యాగుకు 20 రూపాయలు అధికంగా ఉంటుందన్నారు. అనంతరం 60 మంది తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష చొప్పున ప్రమాద బీమా బాండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వీరాంజనేయరెడ్డి, డీలర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సంస్థ టెక్నికల్ ఇంజనీర్ సామ్రాట్
తాపీ మేసీ్త్రలకు ప్రమాద బీమా
బాండ్ల అందజేత