గుండిచా ప్రవేశ రుసుం రూ.10 | - | Sakshi
Sakshi News home page

గుండిచా ప్రవేశ రుసుం రూ.10

Nov 27 2025 7:31 AM | Updated on Nov 27 2025 7:31 AM

గుండిచా ప్రవేశ రుసుం రూ.10

గుండిచా ప్రవేశ రుసుం రూ.10

భువనేశ్వర్‌: పూరీ శ్రీగుండిచా ఆలయం వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా తెరవనున్నారు. ఆలయ ప్రవేశానికి ఒక్కో భక్తుడు రూ.10 చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భక్తులు, 80 సంవత్సరాల పైబడిన, దివ్యాంగ భక్తులకు ప్రవేశం పూర్తిగా ఉచితం. భక్తులకు మొబైల్‌, షూ స్టాండ్‌లు, ఉచిత సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. గుండిచా ఆలయం నిత్యం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరవధికంగా తెరిచి ఉంటుంది. ఏడాదిలో నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. భక్తుల ప్రవేశం, నిష్క్రమణ సింహ ద్వారం గుండా ఉంటుంది. దివ్యాంగ భక్తుల కోసం ర్యాంప్‌ వ్యవస్థ అమలులో ఉంటుందని శ్రీమందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్‌ అరవింద కుమార్‌ పాడీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement