స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

Nov 26 2025 6:07 AM | Updated on Nov 26 2025 6:07 AM

స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

గవర్నర్‌ హరిబాబు కంభంపాటి పిలుపు

భువనేశ్వర్‌: రాష్ట్రంలోని గిరిజన విద్యార్థుల్లో సాంకేతికత ఆధారిత అభ్యాసం వ్యవస్థ ప్రోత్సాహానికి భారత స్టేట్‌ బ్యాంక్‌ వంటి సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని గవర్నర్‌ డాక్టర్‌ హరిబాబు కంభంపాటి పిలుపునిచ్చారు. రాజ్‌ భవన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 7 గిరిజన ప్రాబల్య జిల్లాలు మల్కన్‌గిరి, కందమాల్‌, కొరాపుట్‌, సుందర్‌గఢ్‌, మయూర్‌భంజ్‌, రాయగడ, నవరంగ్‌పూర్‌ ప్రాంతాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు జిల్లా అధికారులతో గవర్నర్‌ మంగళవారం సంభాషించారు. ఈ సందర్భంగా డిజిటల్‌ తరగతి గదుల్లో బోధన, అభ్యాసం, సాధనపై విద్యార్థులు ఉత్సాహం ప్రదర్శించారు.

స్మార్ట్‌ తరగతి గదులు విద్యార్థుల్లో ఉత్సుకతను ప్రేరేపించి అభ్యాస సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయన్నారు. స్మార్ట్‌ ఇంటరాక్టివ్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు, బోధన మరియు అభ్యాస ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల సాధ్యం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. భారత స్టేట్‌ బ్యాంక్‌ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) చొరవ కింద 7 గిరిజన ప్రాబల్య జిల్లాల్లో 46 ఎస్టీ, ఎస్సీ అభివృద్ధి విభాగం పాఠశాలల్లో స్మార్ట్‌ ఇంటరాక్టివ్‌ ప్యానెల్‌లను ఏర్పాటు చేశారు. ఈ చొరవ ఆశాజనకమైన ఫలితాలు సాధించింది. ఈ ప్రేరణతో సాంకేతికత ఆధారిత అభ్యాసం వ్యవస్థ ప్రోత్సాహానికి మరిన్ని సంస్థలు ముందుకు వచ్చేలా అనుబంధ విభాగాలు చర్యలు చేపట్టాలని గవర్నర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement