
బంద్ ప్రశాంతం
కొరాపుట్:
రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాలనే డిమాండ్తో జరిగిన రాయిఘర్ బంద్ ప్రశాంతంగా జరిగింది. గురువారం నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితిలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరవదిక బంద్ జరిగింది. ఈ సమితిలో 344 మంది రైతులు 14 వేల క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వానికి విక్రయించారు. వారికి రు.4.4 కోట్లు అకౌంట్లలో పడాల్సి ఉంది. సుమారు 3 నెలలు కావస్తున్నప్పటికీ వారికి ఒక్క రూపాయి కూడా అందలేదు. ఈ కుంభకోణంపై ప్రతిపక్ష బీజేడీ చాలా కాలంగా ఆందోళనలు చేస్తుంది. ఈ నేపథ్యంలో బీజేడీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రబినారాయణ నందో, పార్టీ రాష్ట్ర సాధారణ కార్యదర్శులైన మాజీ ఎంపీలు రమేష్ చంద్ర మజ్జి, ప్రదిప్ మజ్జి బుధవారం రాత్రి ఆకస్మిక బంద్కు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నుంచి సరిహద్దు ఛత్తిస్గఢ్ రాష్ట్రం నుంచి రాకపోకలు నిలిపి వేశారు. బీజేడీ మాజీ ఎమ్మెల్యే సుభాష్ గోండో, తదితరులు రాయిఘర్ మెయిన్ రోడ్డులో ధర్నా చేశారు. వర్తక, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరవలేదు.

బంద్ ప్రశాంతం