
ముగిసిన ఎస్జీటీల బదిలీలు
మచిలీపట్నంఅర్బన్: సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీలకు ప్రభుత్వం నిర్వహిస్తున్న మాన్యువల్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బదిలీలకు సీనియారిటీ జాబితాల ప్రకారం ఉమ్మడి కృష్ణాజిల్లా లోని 53 మండలాల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 2780 ఎస్జీటీలకు మూడు రోజుల పాటు విద్యాశాఖాధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. అందులో 54 మంది మునిసిపల్ పాఠశాలల్లో, 429 మంది మునిసిపల్ కార్పొరేషన్, 2297 మంది జెడ్పీ/ఎంపీపీ పాఠశాలల్లో ఎస్జీటీలుగా బదిలీ ఉత్తర్వులు పొందారు.