ఖతార్‌లో ఆర్మూర్‌వాసి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ఖతార్‌లో ఆర్మూర్‌వాసి అదృశ్యం

Jun 25 2025 1:16 AM | Updated on Jun 25 2025 1:16 AM

ఖతార్

ఖతార్‌లో ఆర్మూర్‌వాసి అదృశ్యం

ఆర్మూర్‌: పట్టణంలోని కాశీ హనుమాన్‌ గల్లీకి చెందిన కా నూర్‌ నాగరాజు ఖతార్‌లో అ దృశ్యం అయ్యాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపా రు. అతడి ఆచూకీ కనుగొనా లని కోరుతూ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణి లో తండ్రి కానూర్‌ నారాయణ వినతిపత్రం సమ ర్పించారు. ఆరు నెలల క్రితం నాగరాజు ఖతార్‌కు వెళ్లి విధుల్లో చేరాడని, గత నెల 26 నుంచి ఫోన్‌లో అందుబాటులో లేడని అతడి తండ్రి ఆందోళన వ్య క్తం చేశారు. ఏదో క్రిమినల్‌ కేసు విచారణ కోసం పో లీసుల అదుపులో ఉన్నట్లు అనుమానంగా ఉందంటూ సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్మూ ర్‌ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్‌ చైర్మన్‌ మంద భీంరెడ్డి చొరవ చూపాలని వారికి అభ్యర్థనలు పంపారు. ప్రవాసీ ప్రజావాణి కౌంటర్‌ను సందర్శించిన జీఏడీ ఎన్నారై విభాగం అధికారులు శ్రీనివాసరెడ్డి, చిట్టిబాబులకు నారాయణ తన గోడును వెళ్లబోసుకున్నారు.

ఆచూకీ కనుక్కోవాలంటూ ప్రవాసీ

ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబం

ఖతార్‌లో ఆర్మూర్‌వాసి అదృశ్యం1
1/1

ఖతార్‌లో ఆర్మూర్‌వాసి అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement