ఏఎంసీల ఫీజు వసూళ్ల లక్ష్యాలు ఖరారు | - | Sakshi
Sakshi News home page

ఏఎంసీల ఫీజు వసూళ్ల లక్ష్యాలు ఖరారు

Jun 2 2025 1:20 AM | Updated on Jun 2 2025 1:20 AM

ఏఎంసీల ఫీజు వసూళ్ల లక్ష్యాలు ఖరారు

ఏఎంసీల ఫీజు వసూళ్ల లక్ష్యాలు ఖరారు

కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి, వేల్పూర్‌ వ్యవసాయ మా ర్కెట్‌ కమిటీ(ఏఎంసీ)ల మార్కెటింగ్‌ రుసుం వ సూలు లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసింది. గతేడాది నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం పొందడంతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఈ రెండు మార్కెట్‌ కమిటీలకు కలిపి రూ. 92.50 లక్షలుగా మార్కెటింగ్‌ రుసుము(ఫీజు) రూపంలో లక్ష్యం నిర్దేశించింది. ఇందులో కమ్మర్‌పల్లి మార్కెట్‌ కమిటీకి రూ. 60 లక్షలు, వేల్పూర్‌కు రూ.32.50 లక్షలుగా పేర్కొంది. ఈ మేరకు లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

గతేడాది లక్ష్యానికి మించి..

రైతులు పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించే క్రమంలో మార్కెట్‌ కమిటీ చెక్‌పోస్టు వద్ద ఆపి మార్కెటింగ్‌ ఫీజు వసూలు చేస్తారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, సోయాబీన్‌, జొన్నలను మార్కెట్‌కు తరలిస్తారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను కమ్మర్‌పల్లి ఏఎంసీకు రూ. 50లక్షల మార్కెటింగ్‌ ఫీజు లక్ష్యం ఉండగా, రూ.58 లక్షలు వసూలయ్యాయి. వేల్పూర్‌ ఏఎంసీకి రూ. 25లక్షలు లక్ష్యం కాగా, రూ. 32.53 లక్షలు వసూలయ్యాయి. దీంతో ప్రస్తుత ఏడాది లక్ష్యాన్ని పెంచింది.

కమ్మర్‌పల్లి మార్కెట్‌ కమిటీకి

రూ. 60 లక్షలు

వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీకి

రూ. 32.50 లక్షలు

గడువులోగా లక్ష్యం పూర్తి చేస్తాం..

ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాన్ని సిబ్బంది సహకారంతో గడువులోగా పూర్తి చేస్తాం. గతేడాది విధించిన లక్ష్యాన్ని సమర్థవంతంగా పూర్తిచేశాం. మార్కెట్‌కు తరలే ప్రతి వాహనాన్ని చెక్‌పోస్ట్‌ వద్ద సిబ్బంది ఆపి తనిఖీ చేసి మార్కెటింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. – టీ మెర్సీ,

కమ్మర్‌పల్లి, వేల్పూర్‌ మార్కెట్‌ కమిటీల కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement