రండి.. సర్కార్‌ బడుల్లో చేరండి | - | Sakshi
Sakshi News home page

రండి.. సర్కార్‌ బడుల్లో చేరండి

Jun 7 2025 1:08 AM | Updated on Jun 7 2025 1:08 AM

రండి.

రండి.. సర్కార్‌ బడుల్లో చేరండి

మోర్తాడ్‌(బాల్కొండ): విద్యార్థుల ప్రవేశాల కోసం ప్రయివేటు బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విస్తృతమైన ప్రచారం చేపట్టాయి. అడ్మిషన్ల సంఖ్యను పెంచుకోవాలనే సంకల్పంతో జిల్లావ్యాప్తంగా బడిబాట కార్యక్రమంను శుక్రవారం ఆరంభించారు. అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఆకట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. కరపత్రాలు, ఫ్లెక్సీలను ముద్రించి కూడళ్లలో ప్రదర్శిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి తీసుకుంటున్న కార్యక్రమాలను ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. ఉచిత యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, స్కాలర్‌షిపులు, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వెల్లడిస్తున్నారు. గతంలో కంటే ఎక్కువ మంది విద్యార్థులను చేర్పించుకోవడానికి మహిళా సంఘాలు, గ్రామాభివృద్ధి కమిటీల మద్దతుతో ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రయివేటు పాఠశాలల ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు చేస్తున్న ప్రచారం అందరిని ఆకట్టుకుంటుంది.

ప్రయివేటుకు దీటుగా ప్రభుత్వ

ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం

ప్రవేశాల కోసం బ్రోచర్లు, ఫ్లెక్సీలను

ప్రచురించి బడిబాట నిర్వహిస్తున్న వైనం

రండి.. సర్కార్‌ బడుల్లో చేరండి1
1/1

రండి.. సర్కార్‌ బడుల్లో చేరండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement