బాలానగర్‌లో వివాహిత ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

బాలానగర్‌లో వివాహిత ఆత్మహత్య

Jun 7 2025 1:08 AM | Updated on Jun 7 2025 1:08 AM

బాలాన

బాలానగర్‌లో వివాహిత ఆత్మహత్య

జక్రాన్‌పల్లి: మండలంలోని బాలానగర్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గుంజ వెంకట్‌ తన కూతురు గుంజ అక్షయ (19)కు నెల క్రితం నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పల్లపు సునీల్‌ అనే వ్యక్తితో వివాహం జరిపించాడు. కొన్ని రోజులుగా తనను భర్త శారీరకంగా వేధిస్తున్నాడంటూ అక్షయ రెండు రోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. కాగా శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అక్షయ సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త సునీల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మాలిక్‌ తెలిపారు.

మాక్లూర్‌లో యువకుడు..

మాక్లూర్‌: మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన రాచర్ల శ్రీకాంత్‌(29) కోత మిషన్‌పై డ్రైవర్‌గా పని చేస్తూ, జీవనం సాగించేవాడు. గురువారం రాత్రి తన పెళ్లి విషయమై తల్లిదండ్రులతో చర్చించాడు. ప్రస్తుతం వివాహం జరిపించడం కష్టమంటూ తల్లిదండ్రులు తేల్చిచెప్పడంతో అతడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం స్థానిక చెరువులో అతడు శవమై తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఽమృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజశేఖర్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ ఒకరు..

బీబీపేట: ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని ఇస్సానగర్‌ గ్రామానికి చెందిన సంగెపు స్వామి (45) అప్పుల బాద భరించలేక ఈ నెల 4న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తల్లి రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రభాకర్‌ తెలిపారు.

చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

రెంజల్‌ (బోధన్‌): చేపల వేటకు వెళ్లిన జాలరి వలకు చిక్కుకొని ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై చంద్రమోహన్‌ తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని కూనేపల్లికి చెందిన పాముల సాయిలు (50) అనే వ్యక్తి శుక్రవారం స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు వలకు చిక్కుకొని, నీటిలో పడి చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యా దు మేరకు కేసు న మోదు చేసినట్లు పో లీసులు తెలిపారు.

బాలానగర్‌లో వివాహిత ఆత్మహత్య1
1/1

బాలానగర్‌లో వివాహిత ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement