గల్ఫ్‌ మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం | - | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం

May 11 2025 12:12 AM | Updated on May 11 2025 12:12 AM

గల్ఫ్‌ మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం

గల్ఫ్‌ మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం

● ఎన్‌ఆర్‌ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్‌ పర్కిపండ్ల

నిర్మల్‌ఖిల్లా/సారంగపూర్‌: ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లిన సారంగాపూర్‌ మండలం మలక్‌చించోలి గ్రామానికి చెందిన కుర్మే దేవన్న(51)గత గురువారం అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. ఈ విషయాన్ని అతను పనిచేసే కంపెనీ యాజమాన్యం కుటుంబ సభ్యులకు తెలిపింది. దేవన్న మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వస్థలానికి తెప్పించే ఏర్పాట్లు చేస్తామని ఎన్‌ఆర్‌ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్‌ పర్కిపండ్ల తెలిపారు. ఈ మేరకు శనివారం మృతుడి కుటుంబీకులు జిల్లాకేంద్రంలో స్వదేశ్‌ను కలిసి దేవన్న వివరాలు అందించారు. తక్షణమే దుబాయ్‌ ఎంబసీకి సమాచార మందించి ఇండియాకు మృతదేహం తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement