2,800 శునకాలను చంపేశాం.. ఎరువుగా మార్చేశాం | Bhoje Gowda recalled that 2,500 stray dogs were killed and buried in Chikkamagaluru | Sakshi
Sakshi News home page

2,800 శునకాలను చంపేశాం.. ఎరువుగా మార్చేశాం

Aug 14 2025 11:14 AM | Updated on Aug 14 2025 11:47 AM

Bhoje Gowda recalled that 2,500 stray dogs were killed and buried in Chikkamagaluru

కర్ణాటక ఎమ్మెల్సీ భోజేగౌడ వెల్లడి 

బెంగళూరు: వీధి కుక్కల అంశంపై కర్ణాటక శాసన మండలిలో బుధవారం వాడీవేడిగా చర్చ జరిగింది. జేడీ(ఎస్‌) ఎమ్మెల్యే ఎస్‌.ఎస్‌.భోజేగౌడ్‌ చేసిన వ్యాఖ్యలపై జంతు ప్రేమికులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను చిక్కమగళూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో 2,800 శునకాలను చంపేయడాన్ని స్వయంగా పర్యవేక్షించానని ఆయన చెప్పారు. చంపిన శునకాలను చెట్ల కింద సమాధి చేశామని తెలిపారు. చెట్లకు సహజ ఎరువుగా మారడానికే ఇలా చేశామని వెల్లడించారు. అది సాధారణ విషయం అన్నట్లుగా ఆయన నవ్వుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కలను చంపేసి, ఎరువుగా మార్చామన్న భోజేగౌడ ఒక క్రూరుడు అని సోషల్‌ మీడియాలో జనం మండిపడుతున్నారు.   

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement