
పాలమూరులో తిరంగా ర్యాలీ
పాలమూరు: ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా ఆదివారం పాలమూరు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహించారు. జిల్లా ప్రధాన స్టేడియం గ్రౌండ్ నుంచి క్లాక్టవర్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం ఆమె మాజీ సైనికులు, బీజేపీ నేతలు, యువకులతో కలిసి జాతీయ జెండాలు చేతిలో పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పహల్గాం దాడి తర్వాత ప్రధాని నరేంద్రమోదీ సైనికల్లో ధైర్యం నింపారని తెలిపారు. ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదుల స్థావ రాలపై దాడులు చేసి పాకిస్తాన్కు మన సత్తా ఏంటో చూపించామని చెప్పారు.