నేను అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి | SS Rajamouli Request To Donate Plasma on Twitter | Sakshi
Sakshi News home page

నేను అందుకే ప్లాస్మా ఇవ్వలేదు: రాజమౌళి

Sep 1 2020 12:23 PM | Updated on Sep 1 2020 3:23 PM

SS Rajamouli Request To Donate Plasma on Twitter - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నుంచి కోలుకున్న వారు వీలైనంత త్వరగా ప్లాస్మా దానం చేసి ప్రాణాలను కాపాడాలని దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ట్విటర్‌ ద్వారా కోరారు. మన శరీరంలో ఏర్పడిన కరోనా ప్రతి బంధకాలు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయని తెలిపారు. ఈలోపే ప్లాస్మా దానం చేస్తే వేరే వారి ప్రాణాన్ని కాపాడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. తన శరీరంలో యాంటీ బాడీస్‌ కోసం పరీక్ష చేయించుకోగా ఐజీజీ లెవల్స్‌ 8.62 ఉన్నాయని, ప్లాస్మా దానం చేయాలంటే 15కన్నా ఎక్కువ ఉండాలని తెలిపారు. పెద్దన్న కీరవాణి, భైరవ మంగళవారం ఉదయం ప్లాస్మా దానం చేశారని జక్కన్న పేర్కొన్నారు. రాజమౌళి ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.  

చదవండి: ప్లాస్మా దానం చేసిన ఎంఎం కీరవాణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement