కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన తరగతులు | - | Sakshi
Sakshi News home page

కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన తరగతులు

Dec 2 2025 7:42 AM | Updated on Dec 2 2025 7:42 AM

కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన తరగతులు

కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన తరగతులు

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిపుణులతో కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన తరగతులు నిర్వహించాలని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో పీఎం శ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 8లోగా అన్ని పీఎం శ్రీ పాఠశాలల్లో నిపుణులతో కౌన్సెలింగ్‌ తరగతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రూప్‌– 1 అధికారులు, ఇతర అధికారులతో తాము ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించిన తీరు, పోటీ పరీక్షలకు సన్నద్ధమైన విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి శ్రీనివా స్‌, ఎస్‌వో దేవాజీ, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement