జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపిక
కాగజ్నగర్టౌన్: కాగజ్నగర్ మండలం నజ్రుల్నగర్ విలేజ్ నం.3లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఇంద్రజిత్ సన జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమరేందర్, పీడీ రమేశ్ ఆదివారం తెలిపా రు. నవంబర్ 3 నుంచి 5 వరకు వికారాబాద్లో జరిగిన 69వ ఎస్జీఎఫ్ అండర్– 14 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. డిసెంబర్1 నుంచి 6 వరకు మధ్యప్రదేశ్లోని ఉదయ్రాయ్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇంద్రజిత్ను ఉపాధ్యాయులు కాళిదాస్ మండల్, వెంకటేశ్ తదితరులు అభినందించారు.


