ఏళ్లుగా పూరి గుడిసెలో..
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఎంతో సంబురపడ్డాం. కానీ అటవీశాఖ అధికారులు ఇళ్ల నిర్మాణాలను అడ్డుకుంటున్నారు. ఏళ్లుగా పూరి గుడిసెలో పిల్లలతో కలిసి ఉంటున్నాం. సొంతిళ్లు కట్టుకోవాలనే కల కలగానే మిగిలిపోతోంది.
– సుమన్బాయి, లబ్ధిదారు
ఉమ్మడి సర్వే నిర్వహిస్తున్నాం
ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న మేడిపల్లి గ్రామ పంచాయతీలోని 17 మంది, పూసిగూడ గ్రామంలోని 20 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టవచ్చు. మిగితా లబ్ధిదారుల స్థలాలకు ఉమ్మడి సర్వే నిర్వహిస్తున్నాం. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– ప్రవీణ్కుమార్, ఇన్చార్జి ఎఫ్ఆర్వో


