ఆదివాసీ భవన్‌ ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ భవన్‌ ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి

Jul 7 2025 6:10 AM | Updated on Jul 7 2025 6:10 AM

ఆదివాసీ భవన్‌ ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి

ఆదివాసీ భవన్‌ ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి

కెరమెరి: మండల కేంద్రంలోని నెహ్రూనగర్‌ సమీపంలో ఉన్న కుమురంభీం ఆదివాసీ భవన్‌ను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మండల కేంద్రంలో ఉన్న ఏకై క ఆదివాసీ భవన్‌లో పక్కా ప్రణాళికతో టైల్స్‌ పగులగొట్టి విద్యుత్‌ వైర్లను, బోర్డు, బోరు స్టార్టర్‌ను దొంగిలించినట్లు తెలిపారు. దుండగులను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌, ఆదివాసీ సీనియర్‌ నాయకుడు సిడాం జగన్నాథ్‌రావు, రాజ్‌గోండ్‌ సేవాసమితి మండలాధ్యక్షుడు పెందోర్‌ రాజేశ్వర్‌, నాయకులు సోము, సిడాం ధర్మూ, కుమురం భీంరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement