
ఆల్మట్టి ఎత్తు పెంపునకు మహారాష్ట్ర పేచీ
రాయచూరు రూరల్: కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సర్కార్ మొండి వైఖరిని అవలంబిస్తోంది. కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు ప్రకారం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.60 మీటర్ల నుంచి 524.25 మీటర్ల వరకు పెంచుకోడానికి అవకాశం ఉంది.బ బచావత్ తీర్పు మేరకు ఎత్తు పెంచుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విషయంలో లేఖలు రాసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ డ్యాం ఎత్తు పెంపుదలకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గత నెల 9న లేఖ రాసి ఆనకట్ట ఎత్తు పెంచితే సాంగ్లీ, కోల్హాపూర్ జిల్లాలు వరద ముంపునకు గురి కావడం తథ్యమని, దీనిని పున పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు. 2010 డిసెంబర్ 30న కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డు సభ్యుడు బ్రిజేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరాలు తెలపని సర్కార్ నేడు మొండి వాదన చేస్తోంది.
కోర్టులో ఆంధ్రప్రదేశ్ ఎస్ఎల్పీ కేసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) కేసు వేసిందని మహారాష్ట్ర సర్కార్ వాదిస్తోంది. రాష్డ్రంలోని లోక్సభ సభ్యులు ఏకమై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపుదల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎత్తు పెంపుదలతో విజయపుర, బెళగావి, బాగల్కోటె, యాదగిరి, రాయచూరు, గదగ, కొప్పళ జిల్లాల జీవనాడి కృష్ణా నదికి నీటి విడుదలతో 5.30 లక్షల హెక్టార్లకు నీటి పారుదల సౌకర్యం లభిస్తుంది. మరో వైపు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే 75,563 ఎకరాలు ముంపునకు గురవుతుంది. 20 చోట్ల పునర్ వసతి కేంద్రాల స్థాపనకు 64,670 ఎకరాలు, కాలువల నిర్మాణానికి 51,847 ఎకరాలు కలిపి మొత్తం 1,33,867 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. ఎత్తు పెంచితే 130 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం లభిస్తుంది.
2010 నుంచి పెండింగ్లో ప్రతిపాదన
524.25 మీటర్లకు డ్యాం
ఎత్తు పెంచుకునేందుకు అవకాశం