
ఏకధాటి వాన.. చామంతికి వేదన
చిక్కబళ్లాపురం: గత 10 రోజుల నుంచి కురుస్తున్న జడి వానలకు చామంతి పూల తోటలు పాడవుతున్నాయి. చెట్లు కుళ్లిపోవడంతో రైతులకు భారీ నష్టం వస్తోంది. తాలూకాలోని బన్నికుప్పె, నంది దిబ్బూరు, కత్తిరగుప్ప, గుండ్లగుర్కి, రాంపుర ఇతర గ్రామాలలో చామంతి పూల తోటలు ఎక్కువగా ఉన్నాయి. పూలను బెంగళూరుకు తరలించి అమ్ముతారు. గతేడాది ఇదే నెలలో 1 కేజీ పూలు రూ.300 పలికేవి.
అన్ని రకాలుగా నష్టమే
ఇప్పుడు అధిక వర్షాల వల్ల గిరాకీ తగ్గింది, పైగా తోటలు తడిసిపోయి చెట్లు కుళ్లిపోతున్నాయని శ్రీనాథ్ అనే రైతు తెలిపాడు. రెండు ఎకరాల పంటకు రూ.4 లక్షలు ఖర్చుచేశానని, అప్పులు చేసి పంట పెట్టానని తెలిపారు. వర్షపు నీరు పీల్చుకొని పూలు చెడిపోతాయి, మార్కెట్లో విలువ ఉండదని విచారం వ్యక్తంచేశాడు. చేతికి వచ్చిన చామంతి పూల చెట్లను పీకేస్తున్నారు. మామూలుగా నవంబరు, డిసెంబరు నెలల్లో రావలసిన తుపానులు మేలో వచ్చి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తమకు పరిహారాన్ని అందజేయాలని కోరుతున్నారు.
కుళ్లిపోతున్న చెట్లు, పువ్వులు
రైతులకు తీవ్ర నష్టం

ఏకధాటి వాన.. చామంతికి వేదన