వడగళ్ల వానలు.. రాలిన పంటలు | - | Sakshi
Sakshi News home page

వడగళ్ల వానలు.. రాలిన పంటలు

Apr 30 2025 12:56 AM | Updated on Apr 30 2025 12:56 AM

వడగళ్ల వానలు.. రాలిన పంటలు

వడగళ్ల వానలు.. రాలిన పంటలు

రాయచూరు రూరల్‌: జిల్లాలో సోమవారం సాయంత్రం వడగళ్ల వానలు కురిశాయి. దేవదుర్గ, సిరవార, మస్కి, మాన్వి, లింగసూగూరు, రాయచూరు తాలూకా ఇడపనూరు, తలమారి, బూడిదపాడు, ఆత్కూరు, సంగంకుంటలో వానలు కురిశాయి. 150 మామిడి చెట్లకు ఉన్న మామిడి కాయలు, పిందలు రాలిపోయి పంటలు దెబ్బ తిన్నాయి. మామిడి పంట దెబ్బ తినడంతో ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు కోరారు. గత మూడు రోజుల నుంచి పంట నష్టం అంచనా వేయడానికి ఏ ఒక్క అధికారి రాలేదని రైతు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

బీదర్‌ జిల్లాలో..

హుబ్లీ: బీదర్‌ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో భారీ వృక్షం నేలకూలడంతో ట్రాఫిక్‌కు తీవ్రంగా ఇబ్బంది కలిగిన ఘటన ఔరాద్‌ తాలూకా జోజన గ్రామం వద్ద చోటు చేసుకుంది. అకాల వర్షాలతో కొన్ని చెట్లు కూలి రోడ్డుపై అడ్డంగా పటడంతో సంతపూర్‌ నుంచి జోజన గ్రామం మధ్య ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో అల్లాడి పోయిన జిల్లా ప్రజలకు ఈ వర్షం కొంత సాంత్వన కలిగించింది. ఔరాద్‌, బీదర్‌, బసవకళ్యాణ, భాల్కి, కమలానగర తదితర చోట్ల భారీ వర్షాలు కురవడంతో ప్రజలు, ముఖ్యంగా రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు.

నష్టాల బాటలో ఉద్యాన రైతులు

పరిహారం కోసం ఎదురుచూపులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement