
క్రమశిక్షణకు శిబిరాలు దోహదం
రాయచూరు రూరల్: విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడేందుకు వేసవి శిబిరాలు దోహదపడతాయని హైదరాబాద్ కర్ణాటక ఆందోళన సమితి అధ్యక్షుడు రజాక్ ఉస్తాద్ పేర్కొన్నారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రంగ కనసు చిణ్ణర చిలిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాలూకాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు పెయింటింగ్, పాటలు పాడటం, కథలు చెప్పడం, చిత్రలేఖనం, సంస్కృతి, సంస్కారం, ఆచార, విచారాలు, సంప్రదాయాలపై అవగాహనకు క్రమశిక్షణ సోపానమన్నారు.
నేటి సమాజానికి ప్రతిరూపం విప్లవ సాహిత్యం
రాయచూరు రూరల్: నేటి సమాజంలో సాహిత్యానికి ప్రతిరూపం విప్లవ సాహిత్యమని ఎంపీ ప్రకాష్ కళాశాల అధికారి మల్లన గౌడ పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీ ప్రకాష్ కళాశాల ఆవరణలో తాలూకా కన్నడ సాహిత్య పరిషత్, సేవా ఎంపీ ప్రకాష్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దత్తి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కన్నడ సాహిత్యం కేవలం కన్నడ భాష, భూమి, జలం కోసం ప్రయత్నిస్తే విప్లవ సాహిత్యం మను ధర్మం, అన్యాయం, దౌర్జన్యం, అవినీతి, అసమానత, కుల మత తేడాలు లేకుండా మనమంతా ఒక్కటే అనే భావాలను గురించి వివరించిందన్నారు. కార్యక్రమంలో కసాప అధ్యక్షుడు వెంకటేష్, రేఖ, శివ శంకర్, పరశురామ్, రాజశ్రీ, రూప, బసవరాజ్ మల్లికార్జున, అక్షయ్, ప్రాణేష్లున్నారు.
కోటల సంరక్షణకు
ప్రణాళిక రచించండి
రాయచూరు రూరల్: నగరంలోని చారిత్రక కోటల సంరక్షణ, నవీకరణకు పథకం రూపొందించాలని జిల్లాధికారి నితీష్ కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు సూచించారు. నగరంలోని మక్కా దర్వాజ, కాటే దర్వాజలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అవసానపు అంచున వున్న కోటలను అభివృద్ధి పరచడానికి తోడు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం కల్పించాలన్నారు. కోట బయట, లోపల, పైభాగాల్లో పర్యటించి స్వచ్ఛతకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు రాజేంద్ర, ఈరణ్ణ బిరాదార్, మహేష్లున్నారు.

క్రమశిక్షణకు శిబిరాలు దోహదం

క్రమశిక్షణకు శిబిరాలు దోహదం