గడ్డివాములు, గుడిసె అగ్నికి ఆహుతి | - | Sakshi
Sakshi News home page

గడ్డివాములు, గుడిసె అగ్నికి ఆహుతి

Mar 5 2024 12:15 AM | Updated on Mar 5 2024 12:15 AM

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది  - Sakshi

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

కంప్లి: కంప్లికొట్టాలలో సోమవారం అగ్నిప్రమాదం సంభవించి క్షణాల్లోనే 6 గడ్డివాములు. ఒక పూరి గుడిసె అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ఘటనతో సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లింది. సమాచారం అందగానే గంగావతి, కురుగోడుల నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాద విషయం తెలియగానే ఎమ్మెల్యే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి బాధితులను పరామర్శించారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి బాధితులను ఆదుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కే.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మిగనూరులో..

ఎమ్మిగనూరులోని ఇటిగి రోడ్డులో ఆకస్మిక అగ్నిప్రమాదం సంభవించి పశువుల మేత కోసం కొనుగోలు చేసి వేసుకున్న 33 ట్రాక్టర్ల వరిగడ్డి వాములు కాలి బూడిదయ్యాయి. ఎమ్మిగనూరు గ్రామానికి చెందిన రైతు శంక్రమ్మకు చెందిన 10 ట్రాక్టర్ల గడ్డి, 5 ట్రాక్టర్ల మొక్కజొన్న సొప్ప, కేఎం పార్వతమ్మకు చెందిన 3 ట్రాక్టర్ల గడ్డి, 5 ట్రాక్టర్ల మొక్కజొన్న సొప్ప, కేఎం మూర్తికి చెందిన 4, వీఎం నీలమ్మవి 3, సీ.రాజకు చెందిన 3 ట్రాక్టర్ల గడ్డి మొత్తం కాలిపోయింది.

ఎమ్మిగనూరులో గడ్డివాము, సొప్ప
కాలిపోతున్న దృశ్యం  1
1/2

ఎమ్మిగనూరులో గడ్డివాము, సొప్ప కాలిపోతున్న దృశ్యం

బాధితురాలిని ఓదార్చుతున్న ఎమ్మెల్యే గణేష్‌2
2/2

బాధితురాలిని ఓదార్చుతున్న ఎమ్మెల్యే గణేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement