ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ‘తుమ్మల’ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ‘తుమ్మల’

Jun 13 2025 5:07 AM | Updated on Jun 13 2025 2:06 PM

‘అడ్లూరి’కి నల్గొండ జిల్లా బాధ్యతలు 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తుమ్మ ల నాగేశ్వరరావు నియమి తులయ్యారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావును నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ల ఇన్‌చార్జీ బాధ్యతల్లో ఎలాంటి మార్పు జరగలేదు. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా శ్రీధర్‌బాబు, హైదరాబాద్‌ జిల్లా మంత్రిగా పొన్నం ప్రభాకర్‌ను కొనసాగించారు. అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రిగా నియమించారు.

బల్దియా కమిషనర్‌గా ప్రఫుల్‌ దేశాయ్‌

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా అశ్విని

వరంగల్‌కు చాహత్‌ బాజ్‌పేయ్‌ బదిలీ

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలకసంస్థ కమిషనర్‌గా ప్రఫుల్‌ దేశాయ్‌ నియామకం అయ్యారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఉన్న ప్రఫుల్‌ దేశాయ్‌ని కార్పొరేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు కొనసాగిన చాహత్‌ బాజ్‌పేయ్‌ని గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా ఉన్న అశ్విని కరీంనగర్‌ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి   మంత్రిగా ‘తుమ్మల’1
1/1

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ‘తుమ్మల’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement