మోసపోయిన మహిళ క్షేమంగా ఇంటికి | - | Sakshi
Sakshi News home page

మోసపోయిన మహిళ క్షేమంగా ఇంటికి

Nov 23 2025 5:53 AM | Updated on Nov 23 2025 5:53 AM

మోసపోయిన మహిళ  క్షేమంగా ఇంటికి

మోసపోయిన మహిళ క్షేమంగా ఇంటికి

అమలాపురం రూరల్‌: ఉప్పలగుప్తం మండలం పెదగాడవిల్లికి చెందిన ఎం.మంగాదేవి దుబాయ్‌లో నకిలీ ఏజెంట్‌ చేతిలో మోసపోయి ఇబ్బందులు పడుతుండగా కోనసీమ సెంటర్‌ ఫర్‌ మైగ్రేషన్‌ కేంద్రం క్షేమంగా ఇంటికి చేర్చినట్టు నోడల్‌ అధికారి కే. మాధవి, మేనేజర్‌ గోళ్ల రమేష్‌ శనివారం తెలిపారు. ఆ మహిళ 2025 11 మే దుబాయ్‌ వెళ్లిందని అక్కడ 3 నెలల 15 రోజులు ఒక ఇంటిలో పనికి కుదిరిందన్నారు. అక్కడ ఆ ఇంటి యజమాని చాలా ఇబ్బంది పెడుతూ ఒత్తిడి చేస్తూ ఉండేవారని విషయాన్ని ఏజెంట్‌ దృష్టికి తీసుకు రాగా అతను పనుల నిమిత్తం పలు ఇళ్లకు తిప్పుతూ ఇబ్బంది పెట్టాడని తెలిపారు. భోజనం పెట్టేవారు కాదని ఈ క్రమంలో ఆరోగ్యం చెడిపోయి ఇబ్బంది పడిందని చెప్పారు. మంగాదేవి కుటుంబ సభ్యులు కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ను ఆశ్రయించగా ఆయన కోనసీమ సెంటర్‌ ఫర్‌ మైగ్రేషన్‌ కేంద్రాన్ని ఈ అంశం పరిశీలించమని ఆదేశించగా సిబ్బంది బాధితురాలితో, ఏజెంట్‌తో సంప్రదింపులు జరిపి ఆమెను క్షేమంగా ఇండియాకు చేర్చారు.

పెదపట్నంలంకలో

షూటింగ్‌ సందడి

మామిడికుదురు: ‘‘రాజి మంచి మొడుడు కావాలని దేవుడికి దండం పెట్టుకో అమ్మా’’ అంటూ కథనాయికి జయశ్రీకి తండ్రి పాత్రధారి రాజీవ్‌ కనకాల చెబుతున్న సీన్‌తో పెదపట్నంలంకలో శనివారం ‘రాజి’... ‘‘నో కాంప్రమైజ్‌’’... సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement