
బీజింగ్: అమెరికా సంతతికి చెందిన చైనా నిపుణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాగ్రత్త పడకపోతే కోవిడ్-19 కన్నా దారుణ విపత్తు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఇటీవల చైనాకు చెందిన ఇద్దరు సైంటిస్టులు ప్రమాదకరమైన ఫంగస్ను రహస్యంగా అమెరికాకు తరలించేందుకు కుట్ర చేశారు. ఆ కుట్రను అమెరికా గుట్టు రట్టు చేసింది.
యావత్ ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టిన కోవిడ్-19 మహమ్మారి.. మొట్టమొదటగా చైనాలోని వుహాన్లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా మరోసారి కోవిడ్-19 కంటే ప్రమాదకరమైన పొటెన్షియల్ ఆగ్రోటెర్రరిజం వెపన్ పేరుతో ప్రమాదకరమైన ఫంగస్ ఫ్యూసారియం గ్రామినియంను అమెరికాకు తరలించింది. చైనా సైంటిస్టులు యున్ క్వింగ్ జియాన్ (33),జూన్ యాంగ్ లియూ (34) ఫంగస్ను స్మగ్లింగ్ చేయడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ క్రమంలో ఫంగస్ విషయంలో అమెరికా జాగ్రత్తగా ఉండాలని చైనా నిపుణుడు గార్డన్ జి.చాంగ్ వార్నింగ్ ఇచ్చారు.‘అమెరికాతో యుద్ధం చేసేందుకు చైనా సిద్ధమైంది. అమెరికా తక్షణ చర్యలు తీసుకోకపోతే కోవిడ్-19 కంటే భయంకరమైన విపత్తు చోటు చేసుకునే అవకాశం ఉంది. 2020లో చైనా పండించిన విత్తనాల్ని అమెరికాలోని 50 రాష్ట్రాలకు రవాణా చేసింది. ఆ విత్తనాల రవాణాకు చైనా ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అది ఆగ్రో టెర్రరిజంలోని భాగమేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
అందుకు 2019 మే నెలలో ప్రముఖ చైనా పత్రిక పీపుల్స్ డైలీ ఎడిటోరియల్ ప్రచురించింది. ఆ ఎడిటోరియల్ సారాంశం అమెరికాతో చైనా యుద్ధం చేయాలి. అదే కథనాన్ని గార్డన్ జి.చాంగ్ ఊటంకిస్తూ.. తాజాగా ఫ్యూసారియం గ్రామినియం ఫంగస్ను అమెరికాకు పంపించింది. చైనా ప్రభుత్వం స్వయంగా ఈ యుద్ధానికి సిద్ధమవుతోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చైనా ప్రజల్ని సైతం సంసిద్ధం చేస్తున్నారు. మనం చైనాను ఎదుర్కొనేలా చర్యలు తీసుకోవాలి. ఆ దేశంతో సంబంధాలను పూర్తిగా తెగదెంపులు చేసుకోవాలని సూచించారు.
చైనా తయారు చేసిన ఈ ఫంగస్ వల్ల గోధుమ, బార్లీ, మొక్కజొన్న, బియ్యానికి నష్టం కలిగించే ఫ్యుసేరియం హెడ్ బ్లైట్ అనే వ్యాధి అపార నష్టాన్ని మిగుల్చుతుంది. ఈ వ్యాధి మానవులకూ, జంతువులకు సోకుతుంది. వాంతులు, కాలేయం దెబ్బతినడం, సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయి.అంతేకాదు, ఈ ఫంగస్ వల్ల ధాన్యం దిగుబడి తగ్గడానికి, నాణ్యత లేని ధాన్యాలు, హానికరమైన మైకోటాక్సిన్లతో (డియోక్సినివాలెనాల్ (DON) వంటివి) కలుషితం కావడానికి దారితీస్తుంది. ఈ వైరస్ ఉన్న ధాన్యంతో తయారు ఆహారం తింటే మనషులు,జంతువులకు ప్రమాదం ఏర్పడనుంది. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ప్రకారం, ఈ ఫంగస్ ఆగ్రోటెరరిజం ఆయుధంగా పరిగణిస్తుంది. అమెరికాను నాశనం చేసేందుకు అమెరికాపై చైనా దీనిని ప్రయోగిస్తుందనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.