టమాట బాక్సు రూ.450 | - | Sakshi
Sakshi News home page

టమాట బాక్సు రూ.450

Jul 2 2025 5:38 AM | Updated on Jul 2 2025 5:38 AM

టమాట బాక్సు రూ.450

టమాట బాక్సు రూ.450

పలమనేరు: టమాట ధరలు ఎట్టకేలకు పెరుగుతున్నాయి. పలమనేరు మార్కెట్లో 15 కిలోల బాక్సు మంగళవారం రూ.450 దాకా పలికింది. సూపర్‌ఫైన్‌ రకం(తొలి కోతలు) రూ.500 దా టింది. ఆ మేరకు పెద్దపంజాణి మండలానికి చెందిన రైతు క్రిష్ణారెడ్డి తోటలోని టమాటాలు రూ. 500 పలికాయి. అయితే వైరస్‌ కారణంగా పంట దిగుబడి తగ్గిందని రైతులు వాపోతున్నారు. ఈ మాత్రం ధరలున్నా టమాటా రైతులకు మేలు కలిగినట్టేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టీచర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఇటీవల టీచర్ల బదిలీలు నిర్వహించిన విషయం విధితమే. అయితే ఈ బదిలీల్లో పలువురు టీచర్లు తమకు అన్యాయం జరిగిందని విద్యాశాఖ అధికారులకు విన్నవించారు. సంబంధిత టీచర్ల అభ్యర్థనలను రెండు రోజుల క్రితం రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నష్టపోయిన 25 మంది టీచర్ల అభ్యంతరాలు(గ్రీవెన్స్‌)ను పరిష్కరించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement