జాన్సన్‌ కంట్రోల్‌.. ఓపెన్‌ బ్లూ సెంటర్‌.. హైదరాబాద్‌

KTR inaugurated the johnson controls Open Blue Innovation Center in Hyderabad - Sakshi

అమెరికన్‌ ఐరీష్‌ బహుళ జాతి సంస్థ జాన్సన్‌ కంట్రోల్స్‌ తన సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో జాన్సన్‌ కంట్రోల్స్‌  ఏర్పాటు చేసిన ఓపెన్‌ బ్లూ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలో సెక్యూరిటీకి సంబంధించిన అన్ని రకాల సర్వీసులు లభిస్తాయి. అదే విధంగా వీడియో సర్వైవలెన్స్‌ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.

జాన్సన్‌ కంట్రోల్స్‌ సంస్థ 135 ఏళ్లుగా సెక్యూరిటీ సర్వీసులు అందిస్తోంది. 150కి పైగా దేశాల్లో ఈ సంస్థకు కస్టమర్లు విస్తరించి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది ఈ సంస్థలో పని చేస్తున్నారు. 

చదవండి: హైదరాబాద్‌ ఈ సిటీలో భారీ ఎత్తున సోలార్‌ ప్యానెళ్ల తయారీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top