పెద్దమ్మతల్లికి జలాభిషేకం | - | Sakshi
Sakshi News home page

పెద్దమ్మతల్లికి జలాభిషేకం

Jul 7 2025 6:23 AM | Updated on Jul 7 2025 6:23 AM

పెద్దమ్మతల్లికి జలాభిషేకం

పెద్దమ్మతల్లికి జలాభిషేకం

పాల్వంచరూరల్‌: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దమ్మతల్లి అమ్మవారికి అర్చకులు జలాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఆదివారం తొలి ఏకాదశి పండుగ కావడంతో మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరపగా, భక్తులు క్యూలైన్‌ ద్వారా దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్‌. రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.

అమ్మవారికి వెండి తాంబాళం బహూకరణ

పెద్దమ్మతల్లి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన భక్త దంపతులు పొల్కంపల్లి ప్రసాద్‌, అరుణ రూ.7,116 విలువైన వెండి తాంబాళం బహూకరించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement