
విభజన అశాసీ్త్రయం
● పాత వార్డులనే కలిపి చూపించారు.. ● క్షేత్రస్థాయి సందర్శన లేకుండానే జాబితాలు.. ● అధికారుల పర్యవేక్షణ లోపం.. బిల్ కలెక్టర్ల ఇష్టారాజ్యం
‘గూడెం’లోనూ అదే తీరు..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల విభజన ముసాయిదా విడుదలైంది. అయితే ఏర్పాటు ప్రక్రియ అందరికీ ఆమోదయోగ్యంగా లేదనే వాదనలు వెల్లువెత్తున్నాయి. డివిజన్ల విభజన కాదు.. పాత వార్డుల్లో కమ్యూనిటీల విభజన చేసినట్టు ఉందని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం గతంలో ఎన్నికై న వార్డు ప్రస్తుతం వారి డివిజన్లో కలిసిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓటర్లయితే తాము ఏ డివిజన్లోనికి వెళ్లాం, అది ఏ ఏరియా అని తెలియక గందరగోళంలో ఉన్నారు. కార్పొరేషన్ కార్యాలయ నోటీసు బోర్డులో ఏర్పాటు చేసిన ముసాయిదా డ్రాఫ్ట్ను చెక్ చేసుకుంటున్నారు. అయితే డివిజన్ల విభజనపై అసంతృప్తిగా ఉన్నవారు అభ్యంతరాలను ఈ నెల 11 వరకు ఇవ్వొచ్చని అధికారులు సూచిస్తున్నారు.
పాల్వంచ నుంచి మొదలు..
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం 60 డివిజన్లుగా విభజించారు. కొత్తగూడెం 29 డివిజన్లు, పాల్వంచ 27, సుజాతనగర్ 4 డివిజన్లుగా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లో మొత్తం 1,34,011 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కొత్తగూడెం పరిధిలో 63,750 మంది, పాల్వంచకు సంబంధించి 61,240, సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీల పరిధిలో 9,021 మంది ఉన్నారు. 1 నుంచి 27వ డివిజన్ వరకు పాల్వంచ ఉండగా, 28 నుంచి 38 వరకు కొత్తగూడెం, మళ్లీ 39 నుంచి 42వ డివిజన్ వరకు సుజాతనగర్ మండలంలోని నిమ్మలగూడెం నుంచి నర్సింహాసాగర్ వరకు, ఆ తర్వాత 43 నుంచి 60వ డివిజన్ వరకు కొత్తగూడెం బాబుక్యాంపు నుంచి కూలీలైన్ వరకు ఏర్పాటు చేశారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే ఈనెల 11 వరకు సమర్పించాలని అధికారులు కోరారు.
అశ్వారావుపేట : ‘తాళి కట్టించా.. తన్నుకు చావండి..’ అన్న చందంగా మారింది అశ్వారావుపేట మున్సిపాలిటీలో వార్డుల డీలిమిటేషన్ ప్రక్రియ. మున్సిపాలిటీలో వార్డులు, డివిజన్ల ఏర్పాటు/ పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ముందే సిద్ధం కావాల్సిన మున్సిపల్ సిబ్బంది.. ఆదాయ మార్గాలైన ఎల్ఆర్ఎస్, గృహ నిర్మాణ అనుమతుల వంటి ఆర్థిక లావాదేవీల్లో నిమగ్నమై వార్డుల విభజనను భ్రష్టు పట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి.
అంతా గందరగోళం..
అశ్వారావుపేట మున్సిపాలిటీని 22 డివిజన్లుగా విభజించారు. ఇందులో అశ్వారావుపేట మేజర్ పంచాయతీలోని పాత 16 వార్డులను ప్రస్తుతం 1 నుంచి 8 వార్డులకు కేటాయించారు. 9, 10 వార్డుల్లో పేరాయిగూడెం పంచాయతీలోని ఏఎస్ఆర్ కాలనీ, బీసీ కాలనీ, మోడల్ కాలనీ, ఫైర్ కాలనీలు ఉన్నాయి. ఆ తర్వాత జాతీయ రహదారికి ఉత్తరం వైపున ఉన్న అశ్వారావుపేట సరిహద్దు బండి పుల్లారావు రోడ్డు నుంచి లక్కీ ఆపార్ట్మెంట్ వరకు 11వ వార్డు, అక్కడ కట్ చేస్తే.. వ్యవసాయ క్షేత్రాల ఆవల ఉన్న మారుతీనగర్, గుర్రాల చెరువు ప్రాంతాన్ని 12వ వార్డులో, దొంతికుంట చెరువుకు ఆనుకుని ఉన్న భవనాలు, భద్రాచలం రోడ్కు పడమర భాగాన్ని 13వ వార్డులో, సంతమార్కెట్ నుంచి తూర్పు బజార్ వరకు 14 వార్డుగా, వెలమబజార్ నుంచి భూపతి మాస్టార్ ఇంటి మీదుగా పాలడుగుల రంగమణి ఇంటి వరకు 15వ వార్డు, రామాలయం బజార్, మున్సిపాలిటీ వెనుక భాగం, జవహర్ కాన్వెంట్ నుంచి చెక్పోస్టు వరకు 16వ వార్డు, మళ్లీ కట్ చేస్తే పూర్వ పేరాయిగూడెం పంచాయతీ పరిధిలోని ఇందిరా కాలనీ, బీసీ కాలనీలలో కొంత భాగం 17వ వార్డు, ఆ తర్వాత పేరాయిగూడెం, నెహ్రూనగర్, ఫైర్ కాలనీల్లో కొంత భాగాన్ని 18వ వార్డు, ఆ తర్వాత జాతీయ రహదారి దాటి షిరిడీ సాయి నగర్ను 19 వవార్డు, బస్టాండ్కు తూర్పు భాగపు ప్రాంతాన్ని 20వ వార్డు, ఇందిరాకాలనీ, బీఎస్ఆర్ నగర్లో కొంత భాగం 21వ వార్డు, తిరిగి ఫైర్ కాలనీ, మోడల్ కాలనీల్లో కొంత భాగంతో 22వ వార్డుగా విభజించారు.
మొక్కుబడిగా ప్రక్రియ..
నిబంధనల ప్రకారం వార్డులు ఒకదానికొకటి పక్కపక్కనే ఉండాలి. పూర్వ జనగణన ఆధారంగా వార్డులను విభజించి సరిహద్దులు గుర్తించాలి. జాబితా లపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని మ్యా ప్ రూపొందించాలి. కానీ పేరాయిగూడెం పంచాయతీలోని అన్ని ఆవాసాలను విభజించి రెండు, మూడు వార్డుల్లో పొందు పరిచారు. పాత ఓటరు జాబితా, వార్డుల జాబితాలను కాపీ, పేస్ట్ చేసినట్లుగా ఉంది తప్పితే మున్సిపల్ సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించలేదని పలువురు అంటున్నారు. మొక్కుబడి విభజనతో ఎన్నికల్లో పోటీ చేసే వారితో పాటు, సమస్యల పరిష్కారానికి ఎవరిని సంప్రదించాలో తెలియక ప్రజలకు ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లా ఉన్నతాధికారులైనా స్పందించి డీలిమిటేషన్లో అనుభవం ఉన్న అధికారులతో వార్డుల విభజన చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
డివిజన్ల ముసాదాయి డ్రాఫ్ట్ విడుదల
11 వరకు అభ్యంతరాల స్వీకరణ
అసంతృప్తిలో మాజీలు, ప్రజాప్రతినిధులు

విభజన అశాసీ్త్రయం