పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ

Jun 4 2025 12:23 AM | Updated on Jun 4 2025 12:23 AM

పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ

పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ

కరకగూడెం: పరిశుభ్రతతోనే మలేరియా నియంత్రణ సాధ్యమవుతుందని జిల్లా మలేరియా అధికారి స్పందన స్పష్టంచేశారు. మంగళవారం ఆమె కరకగూడెం పీహెచ్‌సీని సందర్శించి ‘ఆశా డే’కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధిని అరికట్టడంలో సిబ్బంది సేవలతో పాటు ప్రజల సహకారం ఉండాలని, ఇళ్ల చుట్టూ, ఇంటి లోపల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరిబొండాలు, పగిలిన కుండలు, పూలకుండీలు, డ్రమ్ము లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు. అనంతరం పీహెచ్‌సీలోని రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో వైద్యాధికారి రవితేజ, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌ వీరస్వామి, హెచ్‌ఈఓ పోలెబోయిన కృష్ణయ్య, ఎంటీఎస్‌ అరుణ్‌బాబు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement