
నీటి సంప్లో పడి చిన్నారి మృతి
రఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలోని రేగులచలకలో సోమవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోని నీటి సంప్లో ప్రమాదవశాత్తు పడిన చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రేగులచలకకు చెందిన ఆటో డ్రైవర్ సత్తి నరేష్–వినోద్ కుమారి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె శ్రీరాజ్యవి (5) ఇంటి ముందు అడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడి నీటి సంప్లో పడింది. తల్లి ఇంటి పనుల్లో ఉండగా ఈ విషయాన్ని గుర్తించలేదు. కాసేపటి తర్వాత చిన్నారి ఎటు వెళ్లిందోనని ఆరా తీస్తుండగా సంప్లో కనిపించడంతో బయటకు తీసి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అంతసేపు కళ్ల ముందు ఆడుకున్న చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈమేరకు కేసు నమోదు చేసినట్లురఘునాథపాలెం సీఐ ఉస్మాన్షరీఫ్ తెలిపారు.