
బెల్ట్షాపులు తొలగించాలని నిరసన
సత్తుపల్లిరూరల్: మద్యంతో కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నందున బెల్ట్షాప్లు తొలగించాలనే డిమాండ్తో వేంసూరు మండలం శంభునిగూడెంకు చెందిన మహిళలు పలువురు సోమవారం నిరసన తెలిపారు. ఈమేరకు సత్తుపల్లి ఎకై ్సజ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన వారు మాట్లాడారు. ఎకై ్సజ్ అధికారులు స్పందించి గ్రామాల్లో బెల్ట్షాపులు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎస్సై శేఖర్కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పద్మ, రాధ, మారేశ్వరమ్మ, చెన్నమ్మ, తిరుపతమ్మ, సావిత్రి, రమణ, కొలికపోగు సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
డీసీఎంఎస్ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కో–ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు అదనపు కలెక్టర్, సంస్థ పర్సన్ ఇన్చార్జి పి.శ్రీనివాసరెడ్డి ప్రశంసా పత్రాలు అందించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఖమ్మంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి మాట్లాడారు. అనంతరం ఉత్తమ సేవలందించిన ఆఫీస్ సబార్డినేట్ వెలిశాల వెంకటి, కల్లూరు సూపర్వైజర్ పెరుగు నాగరాజు, నేలకొండపల్లి ఉద్యోగి బొడ్డు సంతోష్కు ప్రశంసాపత్రాలు అందించారు. సంస్థ మేనేజర్ కె.సందీప్, ఉద్యోగులు పి.వినోద్, గోపి, శివప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పేకాట రాయుళ్లు అరెస్ట్
టేకులపల్లి: మండలంలోని కిష్టారం గ్రామ శివారులో కొందరు పేకాట అడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు బోడు ఎస్సై బి. శ్రీకాంత్ తెలిపారు. 10 మంది నుంచి 10 బైక్లతో పాటు రూ.3,750 సీజ్ చేసినట్లు వివరించారు.
వర్షానికి కూలిన
ఇంటి పైకప్పు
కారేపల్లి: ఇటీవల కురిసిన వర్షాలతో పూర్తిగా నా నిన పెంకుటింటి కప్పుకుప్పకూలింది. మండలం లోని గేటుకారేపల్లికి చెందిన భూక్యా శాంతి బాలి కల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తోంది. ఆమె సో మవారం పక్కనే ఉన్న బంధువుల ఇంటికి వెళ్లగా, ఇప్పటికే వరుస వర్షాలతో నానిన ఇంటి కప్పు, గోడలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ సమయంలో శాంతి లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. కాగా, అధికారులు తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆమె కోరింది.
చికిత్స పొందుతున్న
వృద్ధురాలు మృతి
కారేపల్లి: పురుగుల మందు తాగిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. మండలంలోని స్టేషన్ చీమలపాడుకు చెందిన బానోతు మంగ్లీ(70) భర్త ఏడాది క్రితం మృతి చెందగా, అప్పుడప్పుడూ మద్యం తాగుతుండేది. ఈ క్రమంలోనే గత నెల 29న మద్యం తాగాక మంగ్లీ పురుగుల మందు తాగింది. కాసేపటికి గమనించిన కుటుంబీకులు ఖమ్మం తరలించి చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందిందని ఎస్ఐ బి.గోపి తెలిపారు.
అడవి జంతువు మాంసం స్వాధీనం
సత్తుపల్లిరూరల్: ఓ వ్యక్తి వద్ద నుంచి అడవి జంతువు మాంసాన్ని అటవీ శాఖ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని జగన్నాథపురం పునరావాస కాలనీకి చెందిన ఓ వ్యక్తివద్ద అటవీ జంతువుమాంసం ఉందనే సమాచారంతో అధికారులు తనిఖీచేపట్టారు. ఈ సంద ర్భంగా మాంసం లభించడంతో ఆయనను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఎస్ఓ కొండారెడ్డి తెలిపారు. అయితే, మాంసం ఏజంతువుదో తేలాల్సి ఉందని పేర్కొన్నారు.
మృతుడి ఆచూకీ గుర్తింపు
దుమ్ముగూడెం: మండలంలోని ఆంధ్రకేసరి నగరం శివారులో కల్వర్ట్ వద్ద ఆదివారం లభించి న మృతదేహాన్ని సోమవారం బంధువులు గుర్తించారు. మృతుడు చర్ల మండలం లింగాపురంపా డు గ్రామానికి చెందిన ముక్కల పూర్ణచందర్రా వు (32)అని పోలీసులు తెలిపారు. మూడు రోజు ల క్రితం ఇంట్లో వెళ్లిన ఆయన కల్వర్టు వద్ద నీటి మడుగులో ఆదివారం మృతదేహామై కనిపించా డు. అధికంగా మద్యం తాగి కల్వర్ట్ పై నుంచి నీళ్లలో పడి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి భార్య అనూష పిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బెల్ట్షాపులు తొలగించాలని నిరసన