ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

Jun 2 2025 12:29 AM | Updated on Jun 2 2025 12:29 AM

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

అశ్వారావుపేటరూరల్‌/ములకలపల్లి: తల్లిదండ్రులు తమ పిల్లలను మన ఊరి ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి నాణ్యమైన ఉచిత విద్యను పొందాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు కోరారు. ఆదివారం అశ్వారావుపేట, ములకపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో యూటీఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో విద్యావంతులైన ఉపాధ్యాయులు, విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలతోపాటు ఉచితంగా పాఠ్య, నోట్‌ పుస్తకాలు, వర్క్‌ బుక్కులు, యూనిఫాంలు, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, రాగి జావ, కోడి గుడ్లు అందిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు వి.వరలక్ష్మి, జిల్లా కార్యదర్శి కృష్ణారావు, నాయకులు ఎం.రాజేశ్వరరావు, ఎన్‌.కొండలరావు, హరినాఽథ్‌బాబు, ఎం.వెంకటేశ్వర్లు, ఎం.సురేష్‌, గరికె శ్రీనివాస్‌, కిషోర్‌, కే. శ్రీరామ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement