
రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ రాక
పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పులివెందులకు రానున్నారు. సోమ వారం సాయంత్రం 5గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా పులివెందులలోని భాకరాపురంలో ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఆ రోజు పులివెందులలోనే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు చేరుకుని అక్కడ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ జగన్ నివాళులర్పించనున్నారు. అక్కడ నుంచి పులివెందులకు చేరుకుంటారు. మంగళవారం సాయంత్రం బెంగుళూరుకు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
పర్యటన వివరాలు: ఈనెల 7న సాయంత్రం పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు 5గంటలకు చేరుకుంటారు. ఈనెల 8న మంగళవారం ఉదయం పులివెందులలోని తన స్వగృహం నుంచి ఉదయం 6.45గంటలకు వాహనంలో రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 7.30గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. 8.15గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 8.45గంటలకు పులివెందుల క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటలకు పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజలతో మమేకం కానున్నారు.