
రేపు ఐటీఐలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్
రాజంపేట టౌన్: జిల్లాలోని ఐటీఐలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు బుధవారం ఉదయం పది గంటల నుంచి రాజంపేట పట్టణం రెడ్డివారివీధిలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ జిల్లా కన్వీనర్ రామిరెడ్డి రాఘవరెడ్డి తెలిపారు. స్థానిక తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రాజంపేట, తంబళ్లపల్లె, పీలేరులోని మూడు ప్రభుత్వ ఐటీఐలతో పాటు పన్నెండు ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయన్నారు. వీటిల్లో ట్రేడ్ల ఖాళీలను బట్టి అభ్యర్థులు తమకు నచ్చిన ట్రేడ్ను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. మెరిట్ నంబర్ 1 నుంచి 50 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెరిట్ నంబర్ 51 నుంచి 98 నంబర్ వరకు 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు టెన్త్ మార్కులలిస్టు, 2025లో ఉత్తీర్ణులైన వారు అయితే మార్కుల జాబితాపై తమ పాఠశాల హెడ్మాస్టర్తో అటెస్టెడ్ చేయించి తీసుకురావాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కుల ధృవీకరణ పత్రం, అగ్రవర్ణాలకు చెందిన పేదలు తహసీల్దార్ జారీ చేసిన ఈడబ్ల్యూఎస్ సర్టిపికెట్, దివ్యాంగులు సంబంధిత అధికారి జారీ చేసిన ధృవీకరణ పత్రం తీసుకురావాలని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో వివిధ ట్రేడ్లకు సంబంధించి 1716 సీట్లు ఉన్నాయన్నారు.