టీడీపీ నేతల బరితెగింపు.. పీఎస్‌ ఎదుటే వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి | TDP Leaders Over Action With YSRCP Activist | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల బరితెగింపు.. పీఎస్‌ ఎదుటే వైఎస్సార్‌సీపీ నాయకుడిపై దాడి

Jun 8 2025 9:47 AM | Updated on Jun 8 2025 10:41 AM

TDP Leaders Over Action With YSRCP Activist

సాక్షి, అన్నమయ్య: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగ పాలనలో టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌ చేసి దాడులు చేస్తున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించి పోలీస్‌ స్టేషన్‌ ముందే వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై హత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో నాగిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

వివరాల ప్రకారం.. అ‍న్నమయ్య జిల్లాలోని పుల్లంపేటలో టీడీపీ నాయకులు బరితెగించారు. పోలీసు స్టేషన్ లోపల నుంచి వచ్చి స్టేషన్ ముందే వైఎస్సార్‌సీపీ నాయకుడిపై హత్యాయత్నం చేశారు. పుల్లంపేట టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సుదర్శన్ రెడ్డికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు.. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గొల్లపల్లికి చెందిన సుదర్శన్ రెడ్డికి టీడీపీ వర్గీయులకు మధ్య గతంలో స్థల వివాదం ఉంది. గత మూడు నెలల క్రితం తన చిన్నాయనపై కూడా దాడిచేసినట్లు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాత్రి పోలీసు స్టేషన్ ఎదుట వాకింగ్ చేస్తుండగా ఐదుగురు టీడీపీ నాయకులు తనను చుట్టుముట్టి హత్యాయత్నం చేశారని బాధితుడు నాగిరెడ్డి చెప్పుకొచ్చారు. అప్పుడే మా చిన్నాయన కేసులో న్యాయం జరిగి ఉంటే ఇంత దాకా వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తక్షణమే రక్షణ కల్పించాలంటూ నాగిరెడ్డి.. పోలీసులను కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement